calender_icon.png 25 August, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విహార యాత్రకు పోయొద్దామని పెట్రోల్ పోసి తగులబెట్టాడు..!

24-08-2025 11:30:45 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రేమించి పెళ్లాడిన భార్యపై లేనిపోని అనుమానం పెంచుకున్న భర్త విహారయంత్రకు పోయొద్దామని నమ్మించి వెంటబెట్టుకుని దారుణంగా హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన ఆరె కంటి శ్రీశైలం (30) అనే యువకుడు, మహబూబ్‌నగర్‌లో నివాసం ఉండే తన భార్య ఆరె కంటి శ్రావణి (27)తో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వీరి ఇరువురి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు రావడంతో భార్య తన పిల్లలతో పాటు మహబూబ్నగర్ లోనే నివాసం ఉంటుంది.  కాగా భార్యపై అనుమానం పెంచుకుని హతమార్చాలని పథకం వేసుకున్నాడు. ఈ నెల 21న కొల్లాపూర్ మండలం సోమశిల విహారయంత్రకు వెల్దామని చెప్పి ఒప్పించి తన బైకుపై మహబూబ్ నగర్ నుండి కొల్లాపూర్ వైపు బయలు దేరారు. పెద్దకొత్తపల్లి మండలం మారేడుమను దీన్నే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం రాగానే పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి భార్యను హతమార్చాడు.

వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి మృత దేహాన్ని తగులబెట్టాడు. తిరిగి తన కూతురు ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో శ్రావణి తండ్రి శ్రీను మహబూబ్నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడు శ్రీశైలం ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆదివారం సంఘటన స్థలాన్ని చూపించాడు. దీనిపై స్థానిక పోలీసుల సహకారంతో మహబూబ్నగర్ పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.