12-06-2025 08:25:13 PM
అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) గురువారం కుప్పకూలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాస్ కుమార్ రమేశ్(40) అనే వ్యక్తి విమాన ప్రమాదంలో ఎమర్జెన్సీ గేట్ నుండి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. తను యుకే పౌరుడైన రామేష్ గత 30 ఏళ్లుగా లండన్ లోనే స్థిరపడ్డానని, తన కుటుంబాన్ని కలిసి వెళ్దామని ఇండియాకు వచ్చాడు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 టేకాఫ్ ఇవాళ మధ్యాహ్నం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే భారీ శబ్ధం వచ్చి కూలిపోయింది.
తన ఎమర్జెన్సీ గేట్ నుండి బయటకు దూకి లేచే సరికి ఆయన విమాన శకలాలు ఉన్నట్లు బాధితుడు వెల్లడించారు. తన సోదరుడు కూడా విమానంలో ఉన్నాడని,అతన్ని వెతికిపెట్టండని రమేశ్ అధికారులను కోరారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం మేఘనినగర్ ప్రాంతం సమీపంలో కూలిపోయిన్నట్లు అధికారులు పేర్కొన్నారు.