28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా: అర్జుల సునీత సుధాకర్ రెడ్డి

28-11-2025 08:05 PM

తరిగొప్పుల,(విజయక్రాంతి): తరిగొప్పుల ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అర్జుల సునీత సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తరిగొప్పుల కేంద్రంలో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో సర్పంచి అభ్యర్థిగా అవకాశం వచ్చినందున పోటీ చేయడానికి బరిలో ఉంటున్నానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని, నిత్యం గ్రామంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం తనకు ఓటు వేసి ప్రజలు గెలిపించాలని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమం కోరే ఏకైక పార్టీ ప్రజల మద్దతు ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు.