calender_icon.png 21 October, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టపగలే మహిళ దారుణ హత్య

21-10-2025 08:47:00 PM

కారుతో ఢీకొట్టి కిందపడిన మహిళను కత్తితో గొంతు కోసిన గుర్తు తెలియని దుండగులు..

ఎపూర్ గ్రామం నడిబొడ్డున ఘటన..

ఉలిక్కిపడిన గ్రామస్తులు..

నూతనకల్/ఆత్మకూరు ఎస్ (విజయక్రాంతి): పట్టపగలు గ్రామం నడిబొడ్డు నుండి నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి కింద పడిన మహిళను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన  మండల కేంద్రంలోని ఏపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొరివి బిక్షమమ్మ(39) తన భర్త కొరివి మల్లయ్యతో ఉన్న తగాదాను పెద్దల సమక్షంలో మాట్లాడి వస్తుండగా గ్రామం నడిబొడ్డున గుర్తు తెలియని వ్యక్తులు వీధిలో నడిచి వస్తున్న బిక్షమమ్మను వెనుక నుండి కారుతో ఢీకొట్టి, కిందపడిన మహిళను దుండగులు కారు నుండి దిగి, తన వెంట తెచ్చుకున్న కత్తితో భిక్షమమ్మ గొంతుపై దారుణంగా పొడిచి హత్య చేశారు.

ఈ సంఘటనతో బిక్షమమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు భిక్షమమ్మకు తన భర్త కొరివి మల్లయ్యకు గత కొంతకాలంగా గొడవలు కొనసాగుతున్నాయి. మృతురాలి భర్త మల్లయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తుండగా వారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు భరత్ హైదరాబాదులో మెకానిక్ గా పని చేస్తుండగా చిన్న కుమారుడు ప్రవీన్ సూర్యాపేట లోచికెన్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. మృతరాలు బిక్షమమ్మ ఇతరులతో అక్రమ సంబంధం ఉన్నదని భర్త మల్లయ్య కుటుంబ సభ్యులు తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలతో గొడవ పడుతుండేవారు. ఈ విషయమై పెద్దలు పలుమార్లు పంచాయతీలు చేసి సర్ది చెప్పినట్లు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఒక దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండడంతో కుటుంబ సభ్యులు దేశ గురువుతో పాటు భిక్షమమ్మను మందలించారు.

తీరు మార్చుకొని భిక్షమమ్మను మంగళవారం తన భర్త మల్లయ్య పెద్దల సమక్షంలో మందలించేందుకు స్థానిక ఒక పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించిన కొద్దిసేపటికే బిక్షమమ్మ ఆ పార్టీ కార్యాలయ సమీపంలో దారుణ హత్యకు గురైంది.సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తో క్లూజ్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు ఇంత సాహసోపేతంగా హత్యకు పాలపడటం చుస్తే ఇది పక్క ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.నడిరోడ్డు పై మహిళను దారుణంగా హత్య చెయ్యడంతో తమకు రక్షణ కరువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మృతురాలి భర్త మల్లయ్య కుటుంబ సభ్యులతో పాటు, దేశ గురువు కుటుంబ సభ్యులు, మల్లయ్య అన్న కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నట్లు  సమాచారం.