14 April, 2026 | 1:21 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

విద్యార్థుల చిరునవ్వుల కోసం చేసిన గొప్ప సహాయం

21-10-2025 08:52 PM

కాసాని కుటుంబం దాతృత్వం ప్రశంసనీయం..

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ యుపిఎస్ పాఠశాలలో హృద్యమైన కార్యక్రమం జరిగింది. స్వర్గీయ శ్రీ కాసాని వేణు జ్ఞాపకార్థంగా, వారి తల్లి శ్రీమతి కాసాని ఎల్లవ్వ పాఠశాల విద్యార్థులందరికీ టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం మొత్తం రూ.12,000 విలువ గల సహాయంగా నిర్వహించబడింది. అలాగే విద్యార్థుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలో రిపేర్ లో ఉన్న ఆర్వో ప్లాంట్ ను సుమారు రూ. 6,000 ఖర్చుతో మరమ్మతు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. వారి దాతృత్వానికి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవలు ఆదర్శప్రాయమైనవి. పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోలి రాజు, ఉపాధ్యాయులు విష్ణు, అంజయ్య, సుధాకర్, రెడ్డి శ్రీనివాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.