23-04-2025 12:06:57 PM
చేగుంట, విజయక్రాంతి: మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లోని సబ్ స్టేషన్ (రెడ్డిపల్లి )దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా(Medchal Malkajgiri District), కుత్బుల్లాపూర్ మండల్, గాజుల రామారం పట్టణానికి చెందిన కమ్మరి మంజుల (44) తన ఆక్టివ (బైక్) రామయంపేట్ నుండి హైదరాబాద్ కు తిరిగి వెళుతుండగా మార్గమధ్యంలో చేగుంట లో ఉన్న సబ్ స్టేషన్ దగ్గర ఆగి ఉన్న లారీని యాక్టివా( బైక్) వెనుకను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే కమ్మరి మంజుల మృతి చెందారు, విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు