calender_icon.png 17 October, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

16-10-2025 10:39:12 PM

ఉప్పల్ (విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం నాచారం కార్తికేయ నగర్ కు చెందిన నరసయ్య బాలలక్ష్మి దంపతుల కుమార్తె అయిన హర్షిని(43) ఉప్పల్ ధర్మపురి కాలనీ చెందిన వెంకటరమణతో 2005లో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గురువారం నాడు హర్షిని ఆత్మహత్యకు పాల్పడింది. హర్షిని మృతికి భర్త వెంకటరమణ అత్తమామల వేధింపులతోనే తమ కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.