14-06-2025 08:10:07 PM
CITU రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు..
నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో కార్మిక చట్టాలపై అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా జులై నెలలో నిర్వహించి సార్వత్రిక సమ్మెకు కార్మికుల సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర నాయకులు కే రాములు(CITU State Treasurer Vanguru Ramulu) పిలుపునిచ్చారు. శనివారం టిఎన్జిఓ భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశనికి గంగామణి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు హాజరై మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మిక ఆస్తిత్వానికి అత్యంత ప్రమాదకరమని, కార్మిక చట్టాల పరిరక్షణకై జులై 9న 11 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ లు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందని వంగూరు రాములు పిలుపునిచ్చారు.
దేశాన్ని 200 సంవత్సరాలు పాలన చేసిన బ్రిటిష్ కాలంలోనే జాతీయోద్యమం లొ భాగంగా కార్మిక హక్కులకై పోరాటాలు జరిగాయన్నారు.ఈ పోరాటాలు ఫలితంగానే 1926 లొ ట్రేడ్ యూనియన్ యాక్ట్ మొట్టమొదటిసారి గా వచ్చిందన్నారు.అనేక మిలిటెంట్ పోరాటాల ఫలితంగా వచ్చిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చారని అన్నారు.ఈ లేబర్ కోడ్ ల ప్రకారం కార్మికులు రోజుకు 12 గంటలు పని చేయాలని, యజమానికి ఇష్టమైనన్ని రోజులు పని చేయించుకుని,తమ ఇస్తరాజ్యంగా ఉన్న ఫలంగా పనిలో నుండి థొలగించవచ్చని అన్నారు.
యూనియన్ పెట్టుకునే హాక్కు లేకుండా పోథుందని అన్నారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు కార్పొరేట్ శక్తులకు లాభాలను కార్మికుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి,వారి ములుగులు పీల్చి పిప్పి చేయదానికె తప్ప మరికటి కాదని అన్నారు. బొమ్మెనసురేష్ సిఐడియూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... వాస్తవంగా ఈ సమ్మె మే 20 న జరగాల్సి ఉండగా ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యం లో దేశ ప్రయోజనాలను సృష్టిలో పెట్టుకుని జులై 9కి వాయిదా వేసామని అన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ఏడాది పాలన పూర్తైన సందర్భం లో కార్మికులకు 12 గంటల పని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప కార్మికుల ప్రయోననాలను పాలక వర్గాలు ఏమాత్రం పట్టించుకోవని అన్నారు. సమర శీల ఉద్యమాలు,పోరాటాలు, సమ్మెల ద్వారా మాత్రమే పాలక ప్రభుత్వాల మెడలు వంచాలని అన్నారు.కార్మిక చట్టాల పరిరక్షణ కై జులై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ని జిల్లా వ్యాప్తంగా కార్మికులలొ విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుౌనిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ అధ్యక్షులు P. గంగామణి, జిల్లా ఉపాధ్యక్షులు జి. కిషన్,జిల్లా కమిటీ సభ్యులు శైలజ, చంద్రకళ, ఆశ వర్కర్ జిల్లా అధ్యక్షులు బి సుజాత, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు నంద,అంగన్వాడి యూనియన్ లావణ్య, భాగ్య తదితరులు పాల్గొన్నారు.