19-08-2025 06:57:51 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బాన్సువాడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా బాన్సువాడ పట్టణ సీనియర్ ఫోటోగ్రఫీ దండు సంజీవరావు ను తన నివాసంలో పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించారు.