19-08-2025 08:35:46 PM
మేడిపల్లి: నగరంలో వరస విద్యుత్తు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రామంతపూర్ పాతబస్తీ బండ్లగూడ లో విద్యుత్ ప్రమాదాల కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. సంబంధిత విద్యుత్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ అలీ ఆదేశాల ప్రకారం... మంగళవారం మేడిపల్లి పరిధిలో పీర్జాదిగూడ, బోడుప్పల్ నగరపాలక సంస్థలు తదితర ప్రాంతాలలో పర్యటించిన విద్యుత్ శాఖ అధికారులు కరెంటు స్తంభాలకు ఏర్పాటుచేసిన కేబుల్ వైర్లను, సెటప్ బాక్స్ లను తొలగించారు. వీటితోపాటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను సైతం తొలగిస్తున్నారు. విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా నివారించే చర్యల్లో భాగంగా కరెంటు స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగిస్తున్నామని డి ఈ లింగయ్య గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ఏడిఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈ హరినాథ్, సిబ్బంది పాల్గొన్నారు.