19-08-2025 08:43:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిపోవడంతో మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి ఇంద్రకరణతో కలిసి సందర్శించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలవల్ల ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుందని, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసం లేదన్నారు. ఈయన వెంట మాజీ ఎంపీ సోయం బాపురావు, తదితరులు ఉన్నారు.