17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

౭వ ర్యాంకు సాధించిన యాదాద్రి భువనగిరి

01-05-2025 12:18 AM

 ఉపాధ్యాయులను అభినందించిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం లో  పదవ తరగతి  వార్షిక  పరీక్షల లో  మన యాదాద్రి భువనగిరి జిల్లా 7 వ స్థానము సాధించడం చాలా ఆనందం కలిగించిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 7 వ స్థానము కు రావడాని కృషిచేసిన జిల్లా విద్యాధికారి గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు  తెలిపారు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన 65 మంది విద్యార్థిని, విద్యార్థులకు  సైకిల్లు అందజేసి అందజేసి వారిని వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని  తెలిపారు.

జిల్లాలో మంచి పలితాలు రావడానికి తీసుకున్న చర్యలు మార్నింగ్ వేకప్ కాల్ అని ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుని ద్వారా కాల్ చేయటం జరిగింది. ప్రతి అధికారి ఒక విద్యార్థిని దత్తత తీసుకొని అ విద్యార్థి ఎలా చదువుతున్నాడు అని ప్రతి నిత్యం విద్యార్థి తో మాట్లాడుతూ  విద్యార్థికి సూచనలు చేయటం జరిగిందన్నారు. ప్రతి నిత్యం జూమ్ మీటింగు ల ద్వారా మండల విద్యాశాధికారి కారులకు, ప్రధానోపాధ్యా యులకు మరియు ఉపాధ్యాయులకు తగు సూచనలు జారీ చేయడం జరిగినది.

పదవ తరగతి చదువుచున్న వెనుకబడిన విద్యార్ధి ఇంటికి స్వయముగా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి చదువు విషయములో తగు సూచనలు ఇవ్వటం జరిగింది. *జిల్లా విద్యాశాఖాధికారికి, సిబ్బందికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్ధిని విద్యార్దులకు మరియు సహకరించిన ఇతర శాఖల అధికారులకు కలెక్టర్ అభినందించారు.