17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి

26-03-2025 01:12 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్,మార్చి25(విజయక్రాంతి): యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా కొనుగోళ్ల కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కోతలకు సంబంధించి రెవెన్యూ గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేయాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమను కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, తార్పాలీన్ కవర్లు వంటివి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఉన్న ప్యాడి క్లీనర్ లతో పాటు మరో 15 ప్యాడి క్లీనర్ లను కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెన్ వెంటనే  వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.

రైతుకు సకాలంలో సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకాల ధాన్యాలు వేరువేరు ప్రదేశాల్లో ఉండేలా చూడాలని సూచించారు. ఎండాకాలం దృశ్య రైతులకు నీడ, తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని తెలిపారు.

సిబ్బంది కొనుగోలు రిజిస్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలని, పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. తేమ యంత్రాన్ని నీడలోనే ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.