09-09-2025 08:40:36 AM
గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండల పరిధిలోని జగ్గుతండ గ్రామపంచాయతీ, బంజారా తండ గ్రామానికి చెందిన బానోత్ కుమార్ (26) సోమవారం సాయంత్రం సమయం సుమారు 6 గంటలకు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.కుమార్ చిన్న వయస్సులోనే తండ్రి చనిపోగా,తల్లి శారద కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.