15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సోషల్ మీడియాకు యువత బానిస

12-11-2025 12:00 AM

నేటి యువత సోషల్ మీడియా మత్తులో మునిగితేలుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సులభతర విధానంలో డబ్బులు సంపాదించాలనే మోజులో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లోకి ప్రవేశించి పందేళ్లో  రూ.వేల నగదు పోగొట్టుకుంటున్నారు. అందుకోసం తొలుత బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేయడం, నగదు కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం చేస్తున్నారు.

ఆ తర్వాత కట్టాల్సిన బకాయిలు పెరిగిపోతుండడంతో చోరీలకు పాల్పడుతున్న యువత పోలీసులకు చిక్కుతున్నారు. అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్‌తో సమస్త ప్రపంచాన్ని వీక్షించే అవకాశమొచ్చింది. కొంతమంది దానిని సక్రమ మార్గంలో వినియోగించుకుంటుంటే.. మరికొందరు మాత్రం క్రికెట్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ యాప్స్ వైపు మళ్లుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో ఏర్పడుతున్న పరిచయాల కారణంగా మత్తు మందు, గంజాయి, మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టబడుతున్నారు. దాదాపు 8 నుంచి 10 గంటల పాటు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతూ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు వచ్చిన తర్వాత పోలీసులు నిఘా పెట్టి పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఐపీఎల్ సమయంలో పెద్దఎత్తున బెట్టింగ్‌లలో యువత భారీ ఎత్తున నగదు పోగొట్టుకున్నారు.

రూ.లక్షల అప్పు చేసి తీర్చలేక బలవన్మరణాలకు పాల్ప డు తూ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగుల్చుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టి దారితప్పక ముందే వారు స న్మార్గంలో నడిచేలా చూడాలి. మంచి, చెడుల గురించి వివరంగా చెప్పాలి. సా నుకూల దృక్పథంతో ఆలోచించేలా ఉండాలి.

 సతీశ్ రెడ్డి, వరంగల్