calender_icon.png 28 June, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో యువకుడిపై బీరు సీసాలతో దాడి

08-06-2025 10:29:59 PM

మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో యువకుడిపై గుర్తు తెలియనీ వ్యక్తులు బీరు సీసాలతో శనివారం రాత్రి యువకునిపై దాడి చేసినట్లు మంథని ఎస్ఐ డేగ రమేష్(SI Dega Ramesh) తెలిపారు.

ఎస్ఐ కథనం ప్రకారం... ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బొల్లంపల్లి సంతోష్ గౌడ్ అనే యువకుడు మంథని అంబేద్కర్ చౌక్ లో శనివారం రాత్రి తిరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక వాహనంలో వచ్చి బీరు సీసాలతో తలపై దాడి చేసి హత్యయత్నం చేశారని, స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకొని సంతోష్ గౌడ్ ను హుటాహుటిన మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

సంతోష్ గౌడ్ పరిస్థితి నిలకడగానే ఉందని, సంతోష్ గౌడ్ పై దాడి చేసిన వారి కోసం సీసీ కెమెరాలు, అనుమానితులను నిఘా పెట్టి విచారణ చేస్తున్నామని త్వరలోనే నిందుతులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ దాడి జరగడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.