08-06-2025 10:26:04 PM
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి(MLA Gaddam Vivek Venkataswamy) రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి, సంబరాలు నిర్వహించి, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, నాయకులు సోత్కు సుదర్శన్, మంద తిరుమల్ రెడ్డిలు మాట్లాడుతూ.. కాకా వెంకట స్వామి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని, ఆయన బాటలో పయనిస్తూ వారి ఇద్దరు కుమారులు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన మనవడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లు ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. కాకా కుటుంబం ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అదిష్టానం వారికి అండగా ఉంటూ, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందన్నారు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని, మంత్రి పదవి చేపట్టిన అనంతరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లూరు లక్ష్మణ్, నేరువట్ల శ్రీనివాస్, ఎండి ఆఫీస్, ఎండి జమీల్, ఎండి పాషా, సోత్కు ఉదయ్, కడారి జీవన్ కుమార్, కనకం రాజు, బూడిద శంకర్, ఆకారం రమేష్, మంకు రమేష్, మహంత్ అర్జున్, సట్ల సంతోష్, మాయ తిరుపతి, బండి శంకర్ గౌడ్, రెడ్డి ఐలయ్య, జావిద్ ఖాన్, ఇసాక్, బుర్ర ఆంజనేయులు, నరసింహ, గోగుల రాజయ్య, అవునూరి పోశం, సురేందర్, రాజేష్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.