20-06-2025 12:52:15 AM
ఎమ్మెల్యే మురళి నాయక్ పిలుపు
మహబూబాబాద్, జూన్ 19 (విజయ క్రాంతి): ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని, రాహుల్ గాంధీ భారత దేశాన్ని ప్రపంచంలో కీర్తించబడే విధంగా ముందుకు తీసుకువెళ్లాలని లక్ష్యంతో భారత్ జోడో యాత్ర నిర్వహించి ప్రజలను సంఘటితం చేసిన గొప్ప నాయకుడని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు.