20-06-2025 12:51:44 AM
నిజామాబాద్ జూన్ 19:(విజయ క్రాంతి) : నిలువెత్తు నిర్లక్ష్యం ఈ ఎలక్ట్రానిక్స్ యాక్స్ ప్రెస్ బస్సు ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. అటు సిబ్బంది ఇటు ప్రయాణికులు ఈ బస్సు అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అసలే అరా కోరా సర్వీసులు ఉన్న సర్వీసులను కుదించారు అందులో పంచ రంగుల తో అలంకరించి కనుల విందుగా ఉన్న ఈ ఎక్స్ప్రెస్ బస్సు ఎప్పుడు ఎక్కడ నిలిచి పోతుందో ఎవరికి తెలియదు.
జాతీయ రహదారులపై మొరాయిస్తున్న ఈ బస్సులో పట్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఒక బస్సు నగరం నడిబొడ్డులో ఆగిపోతే మరో బస్సు డిచ్పల్లి ఇన్నలవై రూట్లో ఆగిపోయింది మరో బస్సు మోర్తాడు బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై తోటిలో ఘోర ప్రమాదం తప్పింది. అసలు ఈ బస్సు సాంకేతిక లోపం వస్తే ఈ బస్సును నడిపే డ్రైవర్ కి కూడా హక్కు లేదు ప్రాథమికంగా దాన్ని సరిచేసి నడపడానికి.
జాతీయ రహదారులపై హెవీ వాహనాలతో పాటు పరుగులు పెట్టే ఈ బస్సులు హఠాత్తుగా నడి రోడ్లో నిలిచి పోతున్నాయి ఫలితంగా వెనుక నుంచి అత్యధిక లోడ్ల తో వచ్చే పెద్ద పెద్ద వాహనాలు వీటిని తప్పించుకో లేకపోతున్నాయి. పరుగులు పెడుతున్న తరుణంలో హఠాత్తుగా రహదారిపై ఈ బస్సులు నిలిచిపోవడంతో వెనుక నుండి వచ్చే భారీ వాహనాలు ఢీకొంటే ఆ ప్రమాదం ఊహించడానికి భయంకరంగా ఉంది.
ఈ బస్సుల సామర్థ్యం నిర్వహణ లోపం స్పష్టంగా కనబడుతోంది. ఎక్కడికక్కడే రోడ్లపై బస్సులు నిలిచిపోవడంతో అటు సిబ్బంది ఇటు ప్రయాణికులు తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని భయాందోళనకు గురవుతున్నారు. గత నెల నిజామాబాద్ నగరం నడిబొడ్డులో టీఎన్జీవో చౌరస్తాలో పరుగులు పెడుతున్న ఈ బస్సు హఠాత్తుగా నిలిచిపోయింది ఆర్పిఎం సిస్టంలో వెనువెను క నే వేగంగా వస్తున్న డీసీఎం డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పిపోయింది.
జగిత్యాల నుండి నిజామాబాద్ వైపు వస్తున్న మరో ఈ బస్సు మోర్తాడ్ రోడ్డు నుండి రోడ్ పైకి వస్తుండగా హఠాత్తుగా నిలిచిపోవడంతో అటుగా వస్తున్న మరో ప్రైవేట్ వాహనం సడన్ బ్రేకులు వేయడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సిబ్బంది ప్పించుకున్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానం డ్రైవర్లకు శిక్షణ వాహనం రోడ్ నడిరోడ్డులో నిలిచిపోతే తీసుకోవలసిన ప్రాథమిక జాగ్రత్తల గురించి డ్రైవర్లకు ఎటువంటి అవగాహన కల్పించకపోవడం, వాహనం నడిరోడ్డులో నిలిచిపోతే ప్రాథమిక చర్యలు చేయడానికి డ్రైవర్ కు ఎలాంటి హక్కు లేదు.
దాదాపు కోటి 80 లక్షలకు పైగా విలువ గల ఈ బస్సు రహదారులపై నిలిచిపోవడంతో కనీసం మరమ్మత్తులు చేయడానికి కూడా డ్రైవర్లకు వీలు లేకుండా పోతుంది. ప్రాథమిక మర్మతులు చేయడానికి యజ మాన్యం నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సిబ్బంది నెల కొండ ఉండి పోతున్నారు. వాహనాన్ని నిలిచిపోయిన సమాచారాన్ని సంబంధిత డిపోలకు చేరవేయడంతో వారు మరో బస్సు ని సంఘటన స్థలానికి పంపి ప్రయాణికులను చేరవేస్తున్నారు.
నిజామాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో2 లో ఈ బస్సులు ఈ కో లైఫ్ ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్ బస్ లు నిజామాబాద్ డిపో లో దాదాపు 90 కి పైగా ఉన్నాయి.. నిజామాబాద్ డిపోకు చెందిన వివిధ రోడ్లలో ఈ బస్సులను నడుపుతున్నది టి ఎస్ ఆర్ టి సి రోడ్డు రవాణా సంస్థ ఈ బస్సులు రోడ్డు రవాణా సంస్థకు చేరి ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కొత్తగా వచ్చిన ఈ బస్సులలో తరచూ సాంకేతిక లోపాలు రావడం వల్ల నడిరోడ్డులో అడ్డంగా నిలిచిపోతున్నాయి.
అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఈ బస్సులు నడిపే ఆర్టీసీ డ్రైవర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండి బస్సు నిలిచిపోతున్న సూచన వచ్చిన మరుక్షణమే రోడ్డు నుండి పక్కకు తప్పించి ప్రమాదాలు కాకుండా తమ వంతు కృషి చేస్తున్నారు. మరోవైపు నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల అప్రమత్తత తో సమాజంలో నుండి బయట పడుతోంది.
పోటీ ప్రపంచంలో ప్రవేటు సరుకు రవాణా వాహనాలు 80 నుండి 100 స్పీడుతో పరుగులు పెడుతుండడంతో ఆర్టీసీ డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలో ప్రమాదాలను తప్పిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ బస్సుల ను నడపడం రాష్ట్ర రోడ్డు రావణా సంస్థ డ్రైవర్ లకు కత్తి మీద స్వాముల మారింది.ఈ బస్సులు నడపాలంటేనే డ్రైవర్లు తలలు పట్టుకుంటున్నారు. సాంకేతిక సిబ్బంది నిర్లక్ష్యం అధికారుల ఒత్తిడి ప్రయాణికుల చివాట్లు మధ్య ఈ బస్సు డ్రైవర్లు నలిగిపోతున్నారు.
డిపోలో మాత్రం బస్సు కండిషన్ లో ఉంది తీసుకెళ్లండి అని డ్రైవర్లకు అంటగడుతున్నారు ఈ బస్సులు రోడ్ ఎక్కడంతో వాహనాలు రాకపోకలు రద్దీగా ఉన్న జాతీయ రహదారిలపై ఈ బస్సులు మోరాయిస్తున్నాయి. రోజురోజుకు ఈ సంఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. సాంకేతిక లోపము అవగాహన లేకపోవడం తదితర బస్సు తలనొప్పిగా మారాయి. సిబ్బంది నిర్లక్ష్యమా నాసిరకం బస్సలా....? అన్న సందేహాలు ప్రయాణికులకు కలుగుతున్నాయి.
* నేను నా పిల్లలతో కలిసి కామారెడ్డి పోయేటందుకు తెల్లవారుజాము మూడు నలభై నిమిషాల నుంచి రైల్వే స్టేషన్ దగ్గర బస్సు కొరకు ఎదురు చూస్తుండగా నిజామాబాద్ కామారెడ్డి వేములవాడ సిరిసిల్ల నిజామాబాద్ ఫస్ట్ ట్రీప్పు గా నాలుగు 45 నిమిషాలకు ఈ ఎక్స్ ప్రెస్ బస్సు వచ్చింది ఈ కరెంట్ బస్సులో నేను నా పిల్లలు ఎక్కినం. బస్సు త్యాపకూ ఆగిపోతోంది. గంటన్నర తర్వాత డిచ్పల్లిఇంకో బస్సు వచ్చింది
సుకన్య
ప్రయాణికురాలు
* డిచ్పల్లి నుండి వేములవాడ వెళ్లడానికి ఈ బస్సును ఎక్కాను నెమ్మదిగా నడుస్తూ నడుస్తూ డిచ్చిపల్లి కి వెళ్ళగానే రోడ్డుపై హఠాత్తుగా ఆగిపోయింది. వెనుక నుండి లోడుతో ఉన్న అతిపెద్ద వాహనం స్పీడ్ గా వచ్చింది డ్రైవర్ చాకచక్యం వల్ల ప్రమాదం నుండి తప్పించుకోగలిగాం వేములవాడ రాజరాజేశ్వరుడు మమ్మల్ని రక్షించారు.
రాజు
నిజామాబాద్ నుంచి వేములవాడ వెళ్తున్న ప్రయాణికుడు
* ఈ బస్సు అత్యంత ఖరీదైనది బస్సు రన్నింగ్లో లోడ్ ఎత్తుకోవడం మా నేసింది. ఫలితంగా రోడ్డుపై స్లో అయితు ఆగి పోయింది. పలుమార్లు ప్రయత్నించిన ప్పటి కిని లోడ్ ఎత్తు కోకుండా కొద్ది ముందుకు పోయి ఆగి పోతా ఉంది. డీజిల్ ఇంజన్ అయితే మేమే తాత్కాలిక మరమ్మతులు చేసి ఎలాగో లాగా తీసుకెళ్లే వాళ్ళము ఇది ఎలక్ట్రానిక్ బస్సు మేమేమి చేయడానికి తాత్కాలిక మరమ్మత్తులకు మాకు అధికారం లేదు.
యాదగిరి
డ్రైవర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ డిపో
* పొద్దుగల్లా సడే తీన్ భజే నుంచి నిలబడితే కామారెడ్డి ఫస్ట్ బస్సు కరెం టుది వచ్చింది కొంచెం ముందర పోయి నంక జట్కాలు కొడుతూ ఆగిపోయింది. ఇట్లాంటి బస్సు ఇస్తే ప్రజల ప్రాణాలకు ముక్కు కలుగుతుంది. అధికారులు పట్టించుకోవాలి పెద్దది 20 టైర్ల లోడ్ బండి స్పీడ్ తో వచ్చింది డ్రైవరు బండిని పక్కకు తెచ్చేయడంతో ప్రమాదం తప్పింది.
సాబీర్
నిజామాబాద్ నుంచి
కామారెడ్డి ప్రయాణికుడు