1 July, 2026 | 8:09 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

గట్లమల్యాలలో 'యాంటీ డ్రగ్ 5కే రన్'

16-01-2026 02:22 PM

నంగునూరు, విజయక్రాంతి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో శుక్రవారం 'యాంటీ డ్రగ్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ 5కే రన్' ఉత్సాహంగా జరిగింది.వంటేల గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య లక్ష్మి, కుమారుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.రాజగోపాలపేట ఎస్సై టి.వివేక్ ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మత్తు కాదు జీవితం కావాలి" అనే నినాదంతో యువత తమ ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత గ్రామాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ,ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వంటేల కుటుంబ సభ్యులను అభినందించారు.అనంతరం పోటీలో ప్రతిభ కనబరిచిన దండ్ల మల్లేశం (ప్రథమ),బానోతు రోహిత్ (ద్వితీయ),దండ్ల చందు (తృతీయ)లకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంగే నరేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఆరోగ్య శాఖ సిబ్బంది ,గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.