17 April, 2026 | 3:26 AM

దాడిని నిరసిస్తూ యువకుల రన్

25-04-2025 04:49 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ శుక్రవారం కానాపూర్ మార్నింగ్ వాక్ బృంద సభ్యులు టూ కే రన్ నిర్వహించారు. భారతదేశపు జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువకులు ఖానాపూర్ నుంచి బాదలకుర్తి వరకు రన్ నిర్వహించి ఉగ్రదాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు పాల్గొన్నారు.