2 July, 2026 | 11:55 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

Districts - Ranga Reddy

article_48669968.webp
అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం

శేరిలింగంపల్లి, జూలై 2 (విజయక్రాంతి): అండగా ఉంటానని నమ్మించి చందానగర్‌కు చెందిన వితంతువుపై మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి, బెదిరించి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసిన గంగారం కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్‌ను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మూడు రోజుల క్రితమే కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినా పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచడం విమర్శలకు దారితీసింది.2019లో భర్తను కోల్పోయి మానసిక వేదనలో ఉన్న చందానగర్‌కు చెందిన మహిళకు గంగారం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్ (47) పరిచయమయ్యాడు. అండగా ఉంటానని, అన్ని విధాలుగా సాయం చేస్తానని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు.

02-07-2026