మహాదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
10-02-2026 02:09 PM
నారాయణపేట,(విజయక్రాంతి): మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6 వార్డ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహాదేవప్ప ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని తెలుసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావుతో పాటు పాలమూరు ఎంపీ డీకే అరుణలు ఆయన కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఆయన వెంట రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగురా నామాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు




