15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

కార్పొరేషన్ ఎన్నికలలో బల్దియాపై బిజెపి జెండా ఎగరవేస్తాం

20-12-2025 08:53 PM

కార్పొరేషన్ ఎన్నికలలో బల్దియాపై బిజెపి జెండా ఎగరవేస్తాం...

 శక్తి కేంద్ర ఇన్చార్జ్ దొంతు రవి 

నిజామాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు కార్యకర్తల సమీకరణ మొదలైంది. 21వ డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జీ, జిల్లా దొంతుల రవి మరియు పోలింగ్ బూతుల డివిజన్ డివిజన్ కన్వీనర్ దోదోల్ల గిరిబాబు అధ్యర్యంలో నూతన పొలింగ్ బూత్ అధ్యక్షులను, పొలింగ్ బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.

గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి పోలింగ్ స్థాయి కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారని అదే స్ఫూర్తితో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరేలా పోలింగ్ అధ్యక్షులు మరింత కష్టపడి పని చేయాలని నూతనంగా ఎన్నుకోబడిన వారికి దొంతుల రవి విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త లే మూలస్తంభం అని కార్యకర్తలంతా. అంకితభావంతో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనీ అన్నారు. 

21 డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జ్ దొంతులరవి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల కన్వీనర్ గారి దూదుల గిరిబాబు  కమిటీలు వేయడం జరిగింది అధ్యక్షులుగా సతీష్ ప్రసాద్ బొబ్బిలి మహేష్ ప్రవీణ్ రెడ్డి శ్రీనివాస్ అనిల్ కుమార్ అధ్యక్షులుగా జనరల్ సెక్రెటరీ సుధీర్ శ్రీధర్ సెక్రెటరీగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని వారి కోరారు.