16-12-2025 08:35:17 AM
భాద్యులపై చట్టప్రకారం చర్యలు- ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): సోమార్ పేట సంఘటన దురదృష్టకరమని, భాద్యులపై చట్టప్రకారం చర్యలుంటాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమని, భాదాకరమని ఎమ్మెల్యే తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సంఘటన కి కారణమైన వారు ఎంతటివవారైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు విచారణ చేపట్టారని, తాను కూడా పోలీసులతో మాట్లాడటం జరిగిందని నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.