18-06-2025 12:00:00 AM
డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు
నిర్మల్, జూన్ 17 (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని డీసీసీ అధ్య క్షుడు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలోని 135 మంది లబ్ధిదారులకు రూ. 45 లక్షల 64 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పం తో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే, నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తోందని తెలిపారు.
ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో నిర్మ ల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.