18-06-2025 12:00:00 AM
సబ్ కలెక్టర్కు బీజేపీ నేతల వినతి
కాగజ్నగర్, జూన్ 17(విజయక్రాంతి): జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటి స్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 49 వెంటనే రద్దు చేయాలని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు బీజేపీ నేతలు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం కాగ జ్నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ జీవో నెంబర్ 49 కాపీకి నిప్పంటించి నిరసన తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. జీవో నం.49తో జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడి, ప్రజలకు జీవనోపాధి కరువు అవుతుందని తెలిపారు. స్థానికులను, గిరిజనులను గ్రామస్తులను సంప్రదించకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభు త్వం జీవోలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నిదర్శనం అని తెలిపారు. వెం టనే ఈ జీవో నెం 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని లేవ నెత్తుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్ర మంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చేరాల శ్రీ నివాస్, కొండు తిరుపతి, పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు వెంకటేష్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వలపదాసు శ్రీదేవి, బిజెపి సీనియర్ నాయకులు గజ్జల లక్ష్మణ్, సర్పంచ్ దోతుల శ్రీనివాస్, ఎంపి టిసి పెరిసింగుల తిరుపతి, మాజీ ఎంపీటీసీ నూనె సంపత్ కుమార్, కోట వేణు, బీమా న్ కార్ బాపూరావు, రావుల నరేష్, సీనియ ర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.