calender_icon.png 18 June, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తులెకలాన్ లో అమ్మ మాట.. అంగన్వాడీ బాట

17-06-2025 10:28:42 PM

ఇబ్రహీంపట్నం: అంగన్వాడి సేవలు అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సిడిపిఓ వినీతా దేవి(CDPO Vinitha Devi) అన్నారు. గురువారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా తులెకలాన్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో ఈసీసీఈ డే, అక్షరభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ వినీతా దేవి మాట్లాడుతూ.. 3 మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి చిన్నారిని అంగన్వాడి కేంద్రాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

చిన్నారులకు విద్యతో పాటు ఆటపాటలు, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కేంద్రాలు నడుస్తున్నాయని, పిల్లల భవిష్యత్‌కు మద్దతుగా ప్రతి తల్లి తండ్రి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంగన్వాడీలో ప్రీస్కూల్ విద్య కోసం సిలబస్ బుక్స్, టైం టేబుల్, వర్క్ బుక్స్ కూడా అంగన్వాడిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పల్లవి, పంచాయతీ సెక్రెటరీ మల్లేశం, ఏఎన్ఎం ఆశా అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.