ప్రజావాణికి ఒక ఫిర్యాదు
25-08-2026 01:11 AM
సంబంధిత శాఖ అధికారులతో సమస్యను పరిష్కరింప చేసే విధంగా చర్యలు చేపడతాం: ఆర్టీవో
ఎల్లారెడ్డి ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ఆర్టీవో కార్యాలయంలో ప్రజావాణికి ఒక ఫిర్యాదు వచ్చినట్లు ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదు రెవెన్యూ శాఖకు సంబంధించిని సంబంధిత శాఖ అధికారులతో సమస్యను పరిష్కరింపజేసే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణంలోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.






