16 April, 2026 | 6:12 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మిత్రుడి కుటుంబానికి అండగా మిత్ర బృందం

17-11-2025 07:34 PM

చిట్యాల,(విజయక్రాంతి): తమతో కలిసిమెలిసి ఉన్న మిత్రుడు విధి ఆడిన వింత నాటకంలో దూరమైనా స్నేహితుని కుటుంబానికి అండగా మిత్ర బృందం నిలిచారు. చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన తాటి నరేష్ 2012సం.లో మరణించగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మిత్రులందరు కలిసి సోమవారం 3లక్షల 50వేల రూపాయలను జమచేసి  నరేష్ బార్య సరిత, కూతురు మహాలక్ష్మి లకు కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామ ఉపసర్పంచ్ సురిగి లింగస్వామి మాట్లాడుతూ... నరేష్ కుటుంబానికి అండగా ఉంటామని మా తోటి సభ్యుడు మా మధ్యలో లేకపోవడం బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని బరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో తాటి సురేష్, పంతంగి గణేష్, మన్నె లింగస్వామి,మాజీ వార్డు మెంబర్ సురిగి లింగస్వామి, సురిగి మహేష్, బండ మహేష్, మునుకుట్ల శ్రీను, సురిగి జంగయ్య, సురిగి అశోక్, సురిగి లింగస్వామి, గోపగోని లింగస్వామి, ఎల్లంకి నరేష్  పాలెం జంగయ్య, దోనూరి సుధాకర్ రెడ్డి, సురిగి లింగస్వామి పాల్గొన్నారు.