16 April, 2026 | 8:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సెంట్రింగ్ భాగస్వాములు కావాలి

17-11-2025 07:38 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి (విజయక్రాంతి): సెంట్రింగ్ యూనిట్ల లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. సెంట్రింగ్ శిక్షణ పొందిన 32 మంది లబ్ధిదారులకు శిక్షణ సర్టిఫికేట్లు సోమవారం అందజేశారు. యూనిట్‌ల స్థాపనకు ఆర్థిక–సబ్సిడీ సహాయంపై ఆయా శాఖలకు సూచనలు చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెంట్రింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి శిక్షణ పొందిన 32 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్ లో సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులు శిక్షణ పూర్తి చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు ముందడుగు వేశారు. సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో శిక్షణ పొందిన లబ్ధిదారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం కావడానికి సెంట్రింగ్ సేవలు అత్యంత అవసరమని, శిక్షణ పొందిన మీరు ఈ నిర్మాణ కార్యాచరణలో భాగస్వాములు కావాలన్నారు. ఇది మీ ఉపాధికి మాత్రమే కాదు, జిల్లా గృహ నిర్మాణ పురోగతికి కూడా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం, సబ్సిడీలు అందించేందుకు పరిశ్రమల శాఖ, బ్యాంకులు, డీఆర్డీఏ మధ్య సమన్వయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు అవసరమైన సహకారాన్ని డిఆర్డిఏ అధికారులు వెంటనే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారులు, అదనపు డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, డిపిఎం సాయిలు, ఏపిఎం రాజేందర్, అలాగే లబ్ధిదారులు పాల్గొన్నారు.