17-11-2025 08:45:55 PM
చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన అక్షయ్, విష్ణులను మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు ఐదువేల(5,000/-) రూపాయల ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే సహకారంతో వారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుని అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.