17 June, 2026 | 11:47 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

బస్టాండ్ కు అడ్డుగా ఉన్న తోపుడు బండ్ల తొలగింపు

17-11-2025 08:51 PM

కొండపాక: సిద్దిపేట నుంచి హైదరాబాద్ రాజీవ్ రహదారిపై కొమురవెల్లి కమాన్ వద్దగల బస్టాండ్ కనిపించకుండా చిరు వ్యాపారులు తోపుడుబండ్లు అడ్డు పెట్టుకొని వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. తోపుడు బండ్లు అడ్డుగా ఉంచి వ్యాపారం చేస్తున్నందున ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నయని ఇటీవల సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. అందులో భాగంగానే సిపి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం తొగుట సిఐ లతీఫ్ కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాసు లు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఈ చిరు వ్యాపారులతో మాట్లాడి అక్కడి నుంచి బండ్లను తొలగించి వేశారు. బస్టాండ్ ముందు డోజర్ సహాయంతో చదును చేశారు. స్థానిక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.