15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్రూప్ 1 ఫలితాలపై న్యాయ విచారణ జరపాలి

15-04-2025 12:00 AM

అభ్యర్థులకు న్యాయం చేయాలి

నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసన 

హైదరాబాద్‌సిటీబ్యూరో, ఏప్రిల్ 14(విజయక్రాంతి) : ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలపై సీబీఐ, న్యాయ విచారణ జరపాలని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. భార త రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్లకార్డులు , అంబేడ్కర్ చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం గ్రూప్  న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ వరుస హాల్ టికెట్ నంబర్ కలిగిన 68మందికి ఒకే విధం గా మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించా రు. రీకౌంటింగ్‌కు అప్లు చేయకున్నా వచ్చిన మార్కులను ఎలా తగ్గిస్తారన్నారు. ఉర్ధూమీడియంలో పరీక్ష రాసిన 9మందిలో ఏడుగురికి అత్యధిక మార్కులు రావడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలను భయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో మహిళల కోసం సెంటర్ ఏర్పాటు చేయడంపై అనుమానాలున్నాయన్నారు. కా ర్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.