3 April, 2026 | 2:28 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

వినోద పరిశ్రమలో కొత్త శకం

30-08-2024 12:00 AM

డిస్నీ డీల్‌పై అంబానీ

డిస్నీతో తాము నెలకొల్పనున్న జాయింట్ వెంచర్ భారత వినోద పరిశ్రమలో కొత్త శకాన్ని ప్రారంభిస్తుందని ముకేశ్ అంబానీ తెలిపారు. డిస్నీ, రిలయన్స్ మీడియా రూ.70,000 కోట్ల విలీన ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కంటెంట్ క్రియేషన్‌ను డిజిటల్ స్ట్రీమింగ్‌తో కలుపుతామని, ప్రపంచస్థాయి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తామని చెప్పారు.  రిలయన్స్ కుటుంబంలోకి డిస్నీని ఆహ్వానిస్తున్నామని, తమ జియో, రిటైల్ వ్యాపారాల్లానే, మీడియా వ్యాపారం సైతం రిలయన్స్ వృద్ధి కేంద్రంగా అవతరిస్తుందన్నారు.