1 April, 2026 | 1:37 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09-12-2025 10:45 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని పొనుగోడు గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన జలగం సిద్దయ్య(45) అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కల్టివేటర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సిద్దయ్యను ఆసుపత్రికి 108లో తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్లు తెలిపారు.

సిద్దయ్య గడ్డిపల్లి నుంచి గరిడేపల్లి వైపుకు మోటార్ సైకిల్ పై వస్తుండగా ముందుగా కల్టివేటర్ తో వెళుతున్న ట్రాక్టర్ ను ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయిన సిద్దయ్య అప్పన్నపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నారు. ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో సిద్దయ్య చనిపోవడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.