9 April, 2026 | 5:07 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

ఏర్పాట్లు చేయండి.. మున్సిపల్ కమిషనర్ కు వినతి

19-09-2025 09:10 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్  సుంకిశాల సంపత్ రావు,  మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ  దుర్షెడ్ డివిజన్లో బతుకమ్మ ఆడుకునే స్థలాలతో పాటు, ఇరుకుళ్ళ నది వద్ద నిమజ్జనం ఏర్పాట్ల స్థలాలలో శుభ్రపరచి డస్ట్ పోయించి,విద్యుత్ దీపాలను ఏర్పాటు  చేయాలని కోరారు.

చేసి తగిన సిబ్బందిని సమకూర్చలని, అదే విధంగా దుర్శేడ్ స్మశాన వాటికకు సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. దహన కార్యక్రమనంతరం మహిళలు ఆరుబయట స్నానాలు చేస్తున్నారని, మహిళల కోసం స్నానపు గదులను ఉపయోగంలోకి తిరిగి తీసుకరావల్సిందిగా కోరామన్నారు. దాంతోపాటు డివిజన్ కార్యాలయంలో ఆయా అధికారులకు సంబంధించి మొబైల్  నెంబర్లు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు స్పందించేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ద్వారా తెలియజేశామని తెలిపారు.