01-06-2025 12:48:36 AM
‘తెలంగాణ, ఆంధ్రా నాకు రెండు కళ్లు’ అని దశాబ్దం నుంచి వల్లెవేస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో చంద్రబాబు ఆ సి ద్ధాంతా న్ని పదే పదే చెప్పేవారు. ఇటీవల ఏపీలోని కడపలో జరిగిన టీడీపీ మహానాడులోనూ చంద్రబాబు మరోసారి రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఇప్పుడదే రెండు కళ్ల సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒంటపట్టిచ్చుకున్నట్టు కనిపిస్తున్నది.
అయితే.. ఆ రెండు కళ్ల సిద్ధాంతం తనది కాదు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆ సిద్ధాంతాన్ని కవిత ఆపాదిస్తున్నారు. తన సొంత సంస్థ జాగృతి, తన పార్టీ బీఆర్ఎస్ రెండూ.. ‘కేసీఆర్కు రెండు కళ్లు’ అని కవిత ఇప్పటికే ప్రకటించారు. మరి కవిత ప్రకటనపై ఆమె తండ్రి ఎలా స్పందిస్తారు? అనే ఆసక్తి ఇప్పుడు తెలంగాణ సమాజంలో నెలకొన్నది.
రమేశ్ మోతె