calender_icon.png 4 June, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ కమిటీల్లో మహిళలకు సముచిత స్థానం

03-06-2025 01:17:39 AM

పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): పీసీసీ కార్యవర్గం, పార్టీ అనుబంధ విభాగాల్లో పార్టీ కోసం పని చేసిన సీనియర్ మహిళా కార్యకర్తలకు చోటు కల్పి స్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మహిళా కార్యకర్తల పదవుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సోమవారం గాంధీభవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాజకీయాల్లో ఓపిక, కచ్చితత్వం ఉండాలన్నారు. పీఏసీ కమిటీలో అన్నీ కులాల వారికి సముచిత స్థానం లభించిందన్నారు.