03-06-2025 01:18:47 AM
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): రాష్ర్టంలో రాబోయే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 వరకు ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వర్షాలు ఉంటాయని చెప్పింది.