03-06-2025 01:15:47 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
కొత్తపల్లి, జూన్ 2 (విజయక్రాంతి): తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్, ఏడాదిన్నర కాం గ్రెస్ పాలనలో దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివా ళా తీయించారని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్కుమార్ విమర్శించారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ లక్షల కోట్ల అప్పు చేసి నా రాష్ట్ర ప్రజల బతుకులు మారలేదని, 6 గ్యారంటీలుసహా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. ఈ రెండు పార్టీల పాలన, అవినీ తివల్ల అప్పు కూడా పుట్టని పరిస్థితికి తెలంగాణను దిగజార్చారని విమర్శించారు.తెలంగాణ ఏర్పడి నేటికి 11 ఏళ్లయినా ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదని, తెలంగాణ ప్రజల బతుకులు పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్లయిందని, తెలంగా ణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమయం లో తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రా ష్ట్రగా ఉన్న తెలంగాణ కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే... ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనా పుణ్యమా అని ఆ అప్పు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్నా రు. రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డ తలపైన 2 లక్షల రూపాయలకుపైగా అప్పు భారం మోపారన్నారు.
ఉద్యోగులకు జీతాలు కూ డా ఇయ్యలేని పరిస్థితి నెలకొనడంతోపాటు అప్పు కూడా పుట్టని పరిస్థితికి తెలం గాణకు తీసుకురావడం దుర్మార్గమ ని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమ లు చేస్తామనే హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమ లు చేయలేక పూర్తిగా చేతులెత్తేసిందన్నారు.
రైతుల, మహిళల, నిరుద్యోగుల, వ్రుద్దుల, ఉ ద్యోగుల, విద్యార్థులుసహా అన్ని వర్గాల ఆశలను కాంగ్రెస్ పార్టీ అడియాశలు చేసిందని, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సాధించిందేమైనా ఉందంటే... అది గుండు సున్నా.. ఇంకా కాంగ్రెస్ భాషలోనే చెప్పాలంటే ‘గాడిద గుడ్డు’ మాత్రమే సాధించిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.