1 June, 2026 | 3:55 PM

Breaking News

జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •   NEET-UG రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు   •  

ఇరాక్ లో ప్రమాదవశాత్తు ఆలూరు వాసి మృతి

25-10-2025 10:45 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కేంద్రానికి చెందిన కుర్మే బీజ చిన్న రాజేష్(45) గల్ఫ్ దేశంలోని ఇరాక్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక, జీవనోపాధి కోసం సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితమే రాజేష్ విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఒక కట్టడం పనిలో పనిచేస్తూ నిన్న ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పై నుంచి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు శనివారం కుటుంబీకులు తెలిసింది. 

మృతుడు రాజేష్‌కు అమ్మ, భార్య సునీత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆకస్మిక మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజేష్ మృతదేహాన్ని స్వదేశానికి, ఆలూర్ గ్రామానికి తేవడానికి ప్రభుత్వ సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వినతిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మృతదేహాన్ని గ్రామానికి రప్పించేలా చూడాలని కుటుంబీకులు గ్రామస్తులు కోరారు.