13 April, 2026 | 12:58 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

శ్రీ కోదండ రామాలయంలోని కొలువైన దేవతామూర్తులు

25-10-2025 10:43 PM

ఈనెల 26 నుండి 28 వరకు శ్రీ రామ యజ్ఞ మహోత్సవాలు

నేరేడుచర్ల (విజయక్రాంతి): నేరేడుచర్లలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీకమాసం సందర్భంగా శ్రీ రామ యజ్ఞ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ శనివారం తెలిపారు. 

ఆలయ పూజారి బృందావనం శ్రీరామ నరసింహ తేజ ఆధ్వర్యంలో ఈనెల 26న ఆదివారం దాతల సహకారంతో ఏర్పాటుచేసిన స్వామివారి నూతన ఉత్సవ విగ్రహాలు రామ దండం ఉదయం 7-00 గంటలకు పాత రామాలయం నుండి గుడి ఆవరణలోకి ఊరేగింపుగా తీసుకొనిరావడం, రామదండానికి అభిషేకం, స్వామివారికి నూతన వెండి యజ్ఞోపవీతం, ఆంజనేయ స్వామికి మకర తోరణం కిరీటం గధ సమర్పణ రెండవ రోజు 27న సోమవారం రామదండానికి అభిషేకం రాముల వారి నూతన ఉత్సవ విగ్రహాలకి గులాబీ పూలతో అష్టోత్తర పూజ, మూడవ రోజు 28న మంగళవారం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు అరటికాయలతో అలంకారం అనంతరం శ్రీరామ యజ్ఞం, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని రామరక్షా మన మీద ఉండాలని రామదండానికి విశేష అభిషేకాలు హోమం అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోదండ రాముడి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ కోరారు.