బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
సిద్దిపేట/మెదక్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఎంపీగా గెలిచిన తర్వాత రూ. 100కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ వెంకట్రామ్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనా యిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంక ట్రామిరెడ్డి నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకాలు చేశారు.
నామినేషన్ దాఖలు
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్కు సంబంధించి రెండు సెట్లను జిల్లా రిటర్నింగ్ అధికారికి బుధవారం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్గా పనిచేసిన తనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్గా ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆదరించారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందుదొం దేనని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ ఖిదక్ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆమె తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతాప్రభాకర్, గూడెం మహిపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, నాయకులు బట్టి జగపతి, నగేశ్ యాదవ్ పాల్గొన్నారు.