27 July, 2026 | 12:55 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

అక్రమ నల్లా కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలి

25-10-2025 07:34 PM

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్..

కరీంనగర్ (విజయక్రాంతి): అక్రమ నల్లా కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించి... వాటిని అరికట్టేందుకు చర్యలు తీస్కోవాలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శనివారం ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి నల్లా కనెక్షన్ల వివరాల సేకరణపై ప్రత్యేక సర్వే చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్ల పరిదిలోని సప్లైల వారిగా కమర్షియల్, రెసిడెన్షియల్, డబుల్ నల్లా కనెక్షన్లను ట్యాన్ నెంబర్ల ప్రకారం వివరాలను సేకరించాలన్నారు.

నల్లా కనెక్షన్ పొందిన ప్రకారం ఇంచుల వారిగా వివరాలను సేకరించి పూర్తి వివరాలను ఫార్మాట్ ప్రకారం వారం రోజుల్లో అందించాలని ఆదేశించారు. నగర ప్రజలకు సప్లై సమయం ప్రకారం తాగు నీటిని సరఫరా చేయడంతో పాటు నగర వ్యాప్తంగా ఎక్కడ లీకేజీలు ఉన్న వెంట వెంటనే అరికట్టి నీరు వృధా కాకుండా అధికారులు సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈలు ఓం ప్రకాష్, లచ్చిరెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అయూబ్ ఖాన్ ఏఈలు, లైన్ మెన్లు, పిట్టర్లు, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు.