నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి
రంగారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముం దు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని అయ్యసాగర్ క్షేత్ర సమీపంలోని డీఎంకే ఫంక్షన్ హాలులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించా రు.
సమావేశానికి మాజీ మంత్రి చిత్తరంజన్దాస్, నాగర్కర్నూల్ జడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్, కల్వకుర్తి అసెంబ్లీ ఇన్చార్జీ ఇందిరా శోభన్, పీసీసీ నాయకులు రాంరెడ్డి, ఆయిళ్ల శ్రీనివాస్గౌడ్, రంగారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకూర్ల రవికాంత్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు సుద్దపల్లి వెంకటేష్తోపాటు కాంగ్రెస్ శ్రేణులు హాజర య్యారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల మాదిరాగానే పార్లమెంట్ ఎన్నికలో అంద రూ సమన్వయంతో పనిచేసి రవి గెలుపునకు కృషి చేయాలని, కష్టపడిన వారికి పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు.