07-06-2025 12:00:00 AM
అక్కినేని నాగార్జున-అమల దంపతుల రెండో కుమారుడు, నటుడు అక్కినేని అఖిల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీని వివాహమాడారు. జూబ్లీహిల్స్లోని నాగార్జున ఇంటిలో శుక్రవారం తెల్లవారుజామున 3:౩5 గంటలకు ఈ జంట పెళ్లి జరిగింది. వధూవరు లిద్దరి కుటుంబాలతోపాటు అత్యంత దగ్గరి సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వివాహ తంతు జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్చరణ్- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాజమౌళి తనయుడు కార్తికేయ, నటుడు శర్వా నంద్ తదితర సినీప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పెళ్లి బరాత్లో నాగార్జున, నాగచైతన్య తదితరులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు నాగార్జున సైతం పెళ్లి ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.