07-06-2025 12:00:00 AM
ఎస్ఎం 4 ఫిలిమ్స్ బ్యానర్పై గీతాసింగ్, కార్తీక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శ్రుతిలయ నటీనటులుగా ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజాచిత్రం ‘బ్యాచిలర్స్ ప్రేమ కథలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలను శుక్రవారం హైదరాబాద్లో జరుపుకుంది. ప్రముఖ దర్శకుడు వీ సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు.
అనంతరం చిత్ర దర్శక నిర్మాత సాగర్ మాట్లాడుతూ.. “ఇంతకుముందు నేను తీసిన ‘కాలం రాసిన కథలు’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో దానికి సీక్వె ల్గా ‘బ్యాచిలర్స్ ప్రేమకథలు’ తీస్తున్నా. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నా.
ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నా. ఈ నెల లో షూటింగ్ ప్రారంభించుకుంటున్న ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి డీవోపీ: ప్రసాద్ ఎస్; సంగీతం: మెరుగు అరమాన్; ఎడిటర్: నందమూరి హరి.