11-10-2025 12:26:01 AM
కొత్తపల్లి, అక్టోబరు 10 (విజయ క్రాంతి): గంగాధర మండలంలోని వెంకంపల్లి లో గల శ్రీ రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా క్టర్ వి నరేందర్ రెడ్డి శుక్రవారం 1,16,000 రూపాయల విరాళం అందజేశారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాలను సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని, ముఖ్యంగా ప్రాచీనమైన ఆలయాలు చాలా శక్తివంతమైనవని, వాటి పరిరక్షణకై ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంద వేణి వెంకట్, సహస్ర జూనియర్ కళాశాలల అధినేత, ఆలయ కమిటీ చైర్మన్ సంకటి శ్రావణ్, పల్మరి సతీష్ యాదవ్, పల్మరి సంపత్ యాదవ్, తదితరులుపాల్గొన్నారు.