24-01-2026 09:36:45 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): నగరంలోని రేకుర్తిలో నిర్వహించిన ఆల్ఫోర్స్ గర్ల్స్ ఈ టెక్నో పాఠశాల "తరంగ్" వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్య అతిథిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ డి.సాధన హాజరై అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితో కలిసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని, సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ప్రోత్సాహం అందించాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.